Reading Time: 2 minutes
Telangana: చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నారు.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!

చిట్టీల పేరుతో అమాయక జనాలను భార్య భర్తలు ఏకండా కోట్ల రుపాయలు కాజేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన భార్య భర్తలు గత 20 ఏళ్లుగా అమీన్ పూర్ మండలం బీరంగూడలోని BSR కాలనిలో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా స్థానికంగా సాయి గణేష్ టెక్స్‌టైల్స్ పేరుతో బట్టల వ్యాపారం నిర్వహిస్తూ కాలనీవాసులతో మంచి పరిచయాలు పెంచుకున్నారు.

షాపు వద్దకు వచ్చే మహిళలతో శిరీష ఓ బిజినెస్ ఐడియా చెప్పింది. కాలనిలో ఉన్న మహిళలంతా కలిసి చిట్టీలు వేద్దామని ఎవరికి వస్తే వారు తీసుకుందామని నమ్మించింది. కష్టం చేసిన డబ్బులు వృధా ఖర్చులు కాకుండా ఉంటాయని చెప్పడంతో మహిళలు అట్రాక్ట్ అయ్యారు. అలా కొన్నేళ్లుగా కాలనిలో ఉంటున్న సుమారు 50 మంది మహిళలు కలిసి చిట్టీలు వేశారు. అయితే చిట్టి ఎవరికి వచ్చిన ఆ మహిళలను మాయమాటలు చెప్పేది శిరీష.

చిట్టి డబ్బులు నాకే ఇస్తే వచ్చిన డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని శిరీష తోటి మహిళల్ని నమ్మించింది. దింతో చిట్టి డబ్బులు రాగానే శిరిషకే ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా సుమారు 50 మంది మహిళల నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది శిరీష. కొన్ని రోజులపాటు తీసుకున్న డబ్బులకు వడ్డీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని అడగ్గా ఈ రోజు రేపు అంటూ దాటవేస్తూ వచ్చింది. దింతో బాధిత మహిళలు శిరిషని గట్టిగా నిలదీశారు. మా కష్టార్జితాన్ని నమ్మి నీ చేతిలో పెట్టామని. వెంటనే తమ డబ్బులు తమకివ్వాలని చెప్పడంతో కొందరికి ఫలానా తేదీ రోజు ఇస్తామని శిరీష దంపతులు ఖాళీ చెక్కులు ఇచ్చారు.

ఆ తర్వాత కొద్దీ రోజులకు బట్టల షాపుని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. విషయం తెలియడంతో మరోసారి శిరీష దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. తమ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని అందుకే డబ్బులు ఖర్చు అయ్యాయని స్థానికులతో చెప్పారు శిరిష దంపతులు. ఇల్లు అమ్మైనా సరే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాను అని చెప్పారు. నిజమే అనుకోని వారు కూడా శాంతించారు. అంతలోనే వారిలోని దుర్బుద్ధి బయటపడింది.

రాత్రికి రాత్రే ఇల్లు అమ్మేశారు. కట్టుబట్టలతో పరార్ అయ్యారు శిరీష దపంతులు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ.. చేసేదేమిలేక అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో శిరీష, సాంబశివరావుపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిలాడి దంపతులపై తక్షణమే చర్యలు తీసుకుని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.