
వికారాబాద్ అడవుల్లో వనమూలికలను నిజాం పెంచారని, కానీ నగర శివారులో కొందరు ఫాంహౌస్లు కట్టి డ్రైనేజీలు తీసుకెళ్లి గండిపేటలో కలిపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముగ్గురు నీరంతా తీసుకెళ్లి మూసీలో కలిపారని, నేడు నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా నివాసయోగ్యం కాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఫాంహౌస్లపై కఠిన చర్యలు తీసుకున్నామని, కానీ కొందరు పనిగట్టుకుని మాపై సోషల్ మీడియా లో రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి బద్నాం చేశారని ఆరోపించారు. గుజరాత్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే అక్కడ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టారని, అక్కడి నుంచి 60 వేల కుటుంబాలను కూడా తరలించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. యూపీలో గంగానది ప్రక్షాళనకు వేలాది మందిని తరలించారని, ఢిల్లీలో యమునాను ప్రక్షాళన చేస్తామంటేనే బీజేపీ వాళ్లు గెలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.