
Iran Warns US: అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. మంగళవారం ఇరాన్ అణు కేంద్రం ఉన్నట్లు భావిస్తున్న ఇస్ఫహాన్ నగరంపై యూఎస్ బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. మరోవైపు, అమెరికా ఇరాన్లో ‘‘భూతల దాడులకు’’ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే, ఇరాన్ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. ఇరాన్ కూడా భూతల దాడుల్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గడ్డపై అడుగుపెట్టే ఏ శత్రవు కాళ్లనైనా నరికేస్తామని IRGC ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఖతం అల్ అన్బియా ఇరాన్ సాయుధ దళాల ఉమ్మడి కార్యాచరణకు ప్రధాన కార్యాలయం.
Read Also: Fuel Prices: ఆ దేశాల్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ ప్రకారం, దేశంపై దాడి చేయడానికి ప్రయత్నించే ఆక్రమణదారులన కాళ్లను నరికివేస్తామని IRGC ప్రతినిధి ఇబ్రహీనం జుల్ఫికారి చెప్పినట్లు నివేదించింది. ప్రచార యుద్ధం ద్వారా, అత్యాధునిక సైనిక ఆయుధాలు, సామాగ్రిని ప్రదర్శించడం ద్వారా, పిల్లలు, మహిళల్ని , శాస్త్రవేత్తల్ని చంపడం ద్వారా మమ్మల్ని ఆపగలమని వారు అనుకుంటున్నారు, కానీ అది కుదరదు అని ఆయన అన్నారు. అమెరికా భూతల దాడులకు ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవడానికి రష్యా-చెచెన్ దళాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
వాల్ స్ట్రీన్ జర్నల్ కథనం ప్రకారం.. హార్ముజ్ జలసంధి మూసి ఉన్నప్పటికీ ఇరాన్ లో అమెరికా సైనికచర్యను ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు తెలిపింది. దీనికి ముందు పార్లమెంట్ స్పీకర్ గాలిగాఫ్ మాట్లాడుతూ.. అమెరికా రహస్యంగా భూతల దాడికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇరాన్ ఈ దాడికి సిద్ధంగా ఉందని అన్నారు.