నెమలి కేవలం అద్భుతమైన అందం కలిగిన పక్షి మాత్రమే కాదు. అది విషపూరిత పాములను వేటాడే ఒక శక్తివంతమైన వేటగాడు కూడా. కానీ అది అత్యంత ప్రమాదకరమైన పాములను తిని నెమలి ప్రాణాలతోనే ఎలా బతికి ఉండగలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
దీనిపై పశ్చిమ చంపారన్లో 25 సంవత్సరాల అనుభవం ఉన్న వన్యప్రాణి నిపుణుడు అభిషేక్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలి విషపూరిత పాములను తిన్నా ఎటువంటి హాని జరగకుండా ఎలా ఉంటుందనే దాని వెనుక ఉన్న సైన్స్ రహస్యాన్ని ఆయన వివరించారు. నెమలి ఒక సర్వభక్షక జీవి. ఇది కీటకాలను, అత్యంత విషపూరితమైన పాములను కూడా తింటుంది. దాని శరీరం విషం వల్ల ప్రభావితం కాదు. అందుకే హిందూమతం ఈ పక్షిని పవిత్రమైనదిగా భావిస్తుంది. ఈ నైపుణ్యం దానికి ప్రకృతి సిద్ధంగా అందింది.
విషపూరితమైన పామును తిన్న తర్వాత నెమలి ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? అనే సదేహం కూడా చాలా మందికి ఉంటుంది. పాము విషాన్ని నిర్వీర్యం చేసే ప్రత్యేక సామర్థ్యం కలిగిన శక్తి ఈ పక్షి శరీరానికి ఉంటుంది. దీనివల్ల అవి తమ ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఎలాంటి విషపూరితమైన పామునైనా తినగలుగుతాయి.
పాము విషం అనేది ప్రాథమికంగా ఒక సంక్లిష్టమైన ప్రోటీన్. ఇది రక్తంలోకి ప్రవేశిస్తేనే ప్రమాదకరం. అదే నెమలి పామును చంపి దానిని నేరుగా మింగినప్పుడు ఆ విషం నేరుగా దాని కడుపులోకి వెళుతుంది. అది రక్తంతో కలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పక్షి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అదే నెమలి నోటిలో లేదా కడుపులో పుండ్లు, గాయాలు లేకపోతేనే పాములను తిన్న తర్వాత కూడా అవి సురక్షితంగా ఉండలవు. ఒక వేళ గాయం ఉంటే.. ఆ గాయం ద్వారా విషం రక్తంలోకి వెళ్తుంది. కానీ నెమలి మాత్రం పామును పూర్తిగా మింగేస్తుంది కాబట్టి, విషం సురక్షితంగా జీర్ణమవుతుంది.
మనుషుల్లో నోటి పూతలు సర్వసాధారణం. అయితే నెమళ్ల వంటి పక్షులలో ఇవి చాలా అరుదుగా వస్తాయి. విషం వాటి రక్తంలోకి ప్రవేశించదు. కాబట్టి అది కడుపులో జీర్ణమైపోతుంది. విషపూరితమైన ఆహారాన్ని తిన్న తర్వాత కూడా నెమళ్లు అంత శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండటానికి అసలు రహస్యం ఇదేనని వన్యప్రాణి నిపుణుడు అభిషేక్ తెలిపాడు.




