
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అమెరికా నుంచి గల్ఫ్ దేశమైన యూఏఈ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 72 శాతం వరకు పెరిగాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గ్యాలన్కు (1 గ్యాలన్ = 3.8 లీటర్లు) 4 డాలర్లకు పైగా (భారత రూపాయలలో సుమారు రూ. 380) పెరిగాయి. అంటే ఒక లీటరు ధర రూ. 100కి చేరింది. గత మూడేళ్లలో గ్యాసోలిన్ ధరలు ఈ స్థాయిని దాటడం ఇదే మొదటిసారి.
Also Read:World Backup Day 2026: ఈ 5 రకాల డేటాను క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారా?.. ఎంత డేంజరో తెలుసా?
అమెరికాలో గ్యాసోలిన్ సగటు ధర గ్యాలన్కు $4.018కి పెరిగింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి జరిగినప్పటి నుండి గ్యాసోలిన్ ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. అమెరికాలో డీజిల్ ధరలు కూడా పెరిగి, గ్యాలన్కు $5 (సుమారుగా గ్యాలన్కు రూ. 475) దాటాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. గల్ఫ్ దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇంధన ధరల కమిటీ కూడా ధరల పెంపును ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త ధరల ప్రకారం, సూపర్ 98 పెట్రోల్ ధర సుమారు 30 శాతం పెరిగి లీటరుకు 3.39 దిర్హమ్లకు (భారత రూపాయలలో లీటరుకు సుమారు 87 రూపాయలు) చేరింది. గతంలో దీని ధర లీటరుకు 2.59 దిర్హమ్లుగా ఉండేది. స్పెషల్ 95 పెట్రోల్ ధర సుమారు 32 శాతం పెరిగి లీటరుకు 3.28 దిర్హమ్లకు చేరింది. గతంలో దీని ధర లీటరుకు 2.48 దిర్హమ్లుగా ఉండేది.
Also Read:Jupally Krishna Rao: ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి హెచ్చరిక!
యూఏఈలో డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గతంలో లీటరుకు 2.72 దిర్హమ్లుగా ఉన్న ధరలు, 72 శాతం పెరిగి 4.69 దిర్హమ్లకు (సుమారు లీటరుకు 120 రూపాయలు) చేరాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధరలు నెలలో 48 శాతం పెరిగి, ప్రస్తుతం బ్యారెల్కు $107.28 వద్ద ఉన్నాయి.