
టీజీఈ జేఏసీ కమిటీ పిలుపుతో ఆందోళనలు
నెట్వర్క్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ) పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్జిల్లాలో ఉద్యోగులు నిరసనలు తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అంగన్వాడీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళన చేశారు.
ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డులను మే 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని, సీపీఎస్ను రద్దు చేసి, ఓపీఎస్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులకు మెమోరండం అందజేశారు.