Reading Time: < 1 minute

హైదరాబాద్: తాము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను  భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగించారు. ప్రజల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, రాష్ట్రాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామని, బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే సమాధానమిస్తామని భట్టి విక్రమార్క సూచించారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పధకం ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్ర బడ్జెట్: రూ.3,24,234 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు

మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు

మూలధన ఆదాయం: రూ.82,870 కోట్లు 

బడ్జెట్ కేటాయింపులు

వ్యవసాయానికి 23,179 కోట్లు

సివిల్ సప్లై శాఖకు 7366 కోట్లు

పశు సంవర్ధక శాఖకి 1529 కోట్ల

విద్యుత్ శాఖకు 21,285 కోట్లు

విద్యా శాఖకి 26, 674 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు 13679 కోట్లు

కార్మిక శాఖకు 998 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖ కి 3143 కోట్లు

షెడ్యూల్ కులాలకు 11784 కోట్లు,

షెడ్యూల్ తెగలకు 7937 కోట్లు

వెనక బడిన తరగతులకు 12511 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి 3769 కోట్లు

రాజీవ్ యువ వికాసం కు 6వేల కోట్లు

గృహ నిర్మాణానికి 7430 కోట్లు

ఐటీ శాఖకు 875 కోట్లు

పరిశ్రమల శాఖకి 3490 కోట్లు

చేనేత శాఖకు 258 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ కు 33,688 కోట్లు

ఇరిగేషన్ కు 22,615 కోట్లు

రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్లు

న్యాయ శాఖకు 2367 కోట్లు

పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు

హోం శాఖకు 11,907 కోట్లు

గోదావరి పుష్కరాలకు 500 కోట్లు

పర్యాటక శాఖకు 1224 కోట్లు.