Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వీరిలో వి.డి. సతీశన్ పరవూరు నియోజకవర్గం నుండి పోటీ చేయనుండగా, రమేష్ చెన్నితలను హరిపాడ్ నుండి నామినేట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్‌ను పుత్తుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దింపారు. ఇతర కీలక అభ్యర్థులలో వట్టియూర్కావు నుండి కె. మురళీధరన్, చిరాయిన్‌కీజు నుండి రమ్య హరిదాస్ ఉన్నారు.

కాగా, 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) గెలిచి అధికారాన్ని దక్కించుకుంది.