Reading Time: < 1 minute

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్‌పిజి కొరత వెంటాడుతున్న సమయంలో 46,500 టన్నుల గ్యాస్‌తో కూడిన నందాదేవి నౌక సురక్షితంగా గుజరాత్‌లోని వదినార్ పోర్టుకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధిని దాటుకుని భారత్ చేరుకున్న రెండో భారీ ఎల్‌పిజి నౌక ఇది. మొదటి ఎల్‌పిజి నౌక శివాలిక్ గుజరాత్ లోని ముండ్రా పోర్టుకు సోమవారం చేరుకుంది. ఈ నౌక నుంచి బిడబ్లు బిర్చ్ అనే మరో చిన్న నౌకకు ఈ ఎల్‌పీజీని అన్‌లోడ్ చేస్తారు. అక్కడ నుంచి తమిళనాడు లోని ఎన్నోర్, పశ్చిమబెంగాల్ లోని హాల్డియా, పోర్టులకు ఎల్‌పీజీ రవాణా అవుతుంది. ఈ బదిలీ ప్రక్రియలో గంటకు 1000 టన్నుల వంతున మొత్తం అన్‌లోడింగ్ పూర్తవడానికి రెండు రోజులు పడుతుంది.