
దేవరపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవరపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.