Reading Time: < 1 minute
Kavya Maran Buys Abrar Ahmed Hundred League Bcci Response

BCCI: భారత్‌కు పాకిస్థాన్‌కు మధ్య చాలా కాలం నుంచి సంబంధాలు సరిగ్గా లేవు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను అన్ని రంగాల్లో దూరం పెట్టాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల లండన్‌లో జరిగిన వేలంలో కావ్యా మారన్ పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ ప్లేయర్, స్పిన్నర్ అహ్మద్‌ను 1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు అంటే రూ. 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. టెంట్ రాకెట్స్‌తో పోటీ పడీ మరీ ఈ ఓవర్ అబ్రార్ అహ్మద్‌ను దక్కించుకుంది. ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్‌ క్రికెటర్‌ను సన్‌రైజర్స్ లీడ్స్‌ జట్టు కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ యాజమాన్యం సన్‌ గ్రూపే లీడ్స్‌ టీమ్‌కూ ఓనర్. దీంతో పాక్‌ క్రికెటర్‌ను ఎలా తీసుకుంటారనే విమర్శలూ వచ్చాయి. ఈ ఒక్క నిర్ణయంతో అప్పటి వరకు ఎంతో మంచి మదిని దోచుకున్న కావ్యా ఒక్కసారిగా విలన్‌లా మారిపోయింది. అయితే.. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇది ఐపీఎల్‌కు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. ఇది విదేశీ లీగ్‌లో జరిగిన వ్యవహారం.. దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకునే ఛాన్స్ లేదని తెలిపారు. విదేశీ లీగ్‌లలో ఫ్రాంచైజీలు ఎవరిని తీసుకోవాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదని వివరించారు. పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్‌ను తీసుకోవడంలో ఆ ఫ్రాంచైజీదే తుది నిర్ణయమని వెల్లడించారు..

READ MORE: Tamil Nadu: “రజనీకాంత్‌ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..