రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితోపోడిచి దారుణంగా హత్య చేశాడు. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురిని హత్య చేశాడు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. మే 16వ తేదీన బాధితురాలి తల్లి కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో 28 సంవత్సరాల వయస్సున్న రాజ్ కుమార్ బెయిల్పై తిరిగొచ్చి కక్షతో బాధిత బాలిక, తల్లి, నానమ్మ, పిల్లలను పొడిచి చంపాడు. జిల్లాలోని షాబాద్ మండలం దైవాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.