July 9, 2026

చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి.. నిర్లక్ష్యం చేయొద్దు

చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి.. నిర్లక్ష్యం చేయొద్దు
Reading Time: < 1 minute
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి.. నిర్లక్ష్యం చేయొద్దు

మధుమేహం శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీంతో నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియాతో శరీరం సమర్థంగా పోరాడలేకపోతుంది. అంతేకాకుండా రక్తంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ లాలాజలంతో కలవడం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఫలితంగా దంతాలపై పాచి పేరుకుపోయి చిగుళ్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం అధికమవుతుంది. అధిక రక్త చక్కెర స్థాయిలు శరీరంలో వాపును పెంచి, దంతాలకు మద్దతు ఇచ్చే కణజాలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. దీనివల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం, వాపు, నోటి దుర్వాసన, దంతాలు వదులవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. చికిత్స ఆలస్యం అయితే దంతాలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

మధుమేహంతో బాధపడేవారిలో నోరు పొడిబారడం కూడా సాధారణంగా కనిపించే సమస్య. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా మరింత వేగంగా పెరిగి దంతక్షయం, నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

దంతాలు, చిగుళ్లను ఎలా కాపాడుకోవాలి?

మధుమేహ రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. అలాగే రోజుకు కనీసం రెండుసార్లు పళ్లు తోముకోవడం, ప్రతిరోజూ ఫ్లాసింగ్ చేయడం, తగినంత నీరు తాగడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించడం వంటి అలవాట్లు నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. చిగుళ్ల నుంచి తరచుగా రక్తస్రావం కావడం, నిరంతర వాపు, నోటి దుర్వాసన లేదా దంతాలు వదులుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే దంత వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం అవసరం. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన చిగుళ్లను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.