July 10, 2026

CM Revanth Reddy: 2028లో కాదు.. తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్

CM Revanth Reddy: 2028లో కాదు.. తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్
Reading Time: < 1 minute
CM Revanth Reddy: 2028లో కాదు.. తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్

తెలంగాణలో రాబోయే ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు 2028 డిసెంబర్‌లో జరగవని.. శాసనసభ ఎన్నికలు జరిగేది 2029 మే, జూన్ నెలలోనేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కూడా పెరగబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182కు చేరుతాయని, అలాగే 17గా ఉన్న పార్లమెంట్ స్థానాల సంఖ్య 25కు చేరుతుందని చెప్పుకొచ్చారు.

సీట్లు పెరిగిన తర్వాత జరిగే ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 117 స్థానాలు గెలిచి.. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. ఆ భద్రాచలం రాముడిపై ఒట్టేసి చెబుతున్నా.. ఇది రాసిపెట్టుకోండి.. ఈ రోజు చెప్పింది జరిగి తీరుతుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

అలాగే అటు ప్రతిపక్ష పార్టీలపై కూడా సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతామని.. పాపాల భైరవుడిని ఫామ్‌హౌస్‌లో బంధించామన్నారు. త్వరలో జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది తామేనని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వేదికగా స్పష్టం చేశారు.

సీఎం స్పీచ్‌కు సంబంధించిన వీడియో

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.