Reading Time: < 1 minute
Indian Student Murder Uzbekistan Religious Conversion Allegation

Indian Student: ఉజ్బెకిస్తాన్‌లో చదువుతున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని సవరియా బసంత్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇస్లాం మతంలోకి మారాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారని ఆ విద్యార్థిని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఈ విషయాన్ని చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. సవరియా హత్య కేసులో ఆమెతో చదువుతున్న తోటి విద్యార్థి, కేరళకు చెందిన సద్రుల్ అనం నిందితుడు. మృతురాలు సవారియా, నిందితుడు సదరుల్ అనం ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు.

సవరాయా మామ జానిష్ చెబుతున్న దాని ప్రకారం.. సవారియా మృతదేహాన్ని తీసుకురావడానికి ఉజ్బెకిస్తాన్ వెళ్లినప్పుడు, దర్యాప్తు అధికారులను కలిశామని, సవారియా శరీరం తల నుంచి కాలు వరకు గాయాలు ఉన్నాయని చెప్పారు. హత్య దారుణంగా జరిగిందని, ఒక్క దెబ్బతో చంపినట్లు లేదని చెప్పారు. నిందితుడు సవారియాను మతం మారాలని ఒత్తిడి తెచ్చాడని, ఈ విషయాన్ని ఆమెతో చదువుతున్న విద్యార్థులు చెప్పారని వెల్లడించారు.

కుటుంబ సభ్యులు కేరళలోని అలప్పుజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవారియా మృతదేహానికి రెండో పోస్టుమార్టం నిర్వహించారు. కాలేజీ హాస్టల్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే భవనంలో నివసిస్తారని, నాలుగు అంతస్తుల ఆ భవనంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరు అంతస్తులు ఉన్నాయి. హత్యకు గల కారణం ఇంకా అస్పష్టంగా ఉందని, అయితే సవరియా శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదనేది మాత్రం స్పష్టమని ఆయన అన్నారు.