July 8, 2026

భారత్ వరుస ఓటములు.. కన్నీరు పెట్టుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

భారత్ వరుస ఓటములు.. కన్నీరు పెట్టుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Reading Time: 2 minutes

భారత్ వరుస ఓటములు.. కన్నీరు పెట్టుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

Caption of Image.

Shreyas Iyer Tears: ఇంగ్లాండ్‌తోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20ల మన టీమిండియా మస్తు దారుణంగా ఓడిపోయింది. పరుగుల పరంగా చూస్తే టీ20 చరిత్రలనే ఇది ఇండియాకు అత్యంత ఘోరమైన ఓటమి. రీసెంట్‌గానే టీ20 వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వేసిన 90 mph (145 kmh) బుల్లెట్ బాల్స్‌కు ఏం చేయాలో తెలియక చేతులెత్తేసిండ్రు. ఈ దెబ్బతోటి 5 మ్యాచ్‌ల సిరీస్‌ల ఇంగ్లాండ్ 2-0 తో తిరుగులేని లీడ్‌లోకి వెళ్ళిపోయింది.

ఆట అస్సలు ఒప్పుకోలేం: శ్రేయస్  
మ్యాచ్ ముగిసినంక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము చాలా దారుణంగా (Atrocious) ఆడినం.. అంటు స్టేడియంలోనే కన్నీరు పెట్టుకునేంత పని చేశాడు. 125 పరుగుల భారీ మార్జిన్‌తోని ఓడిపోవడం అస్సలు జీర్ణీంచుకోలేకపోతున్నాం.. వికెట్ మీద బౌలర్లకు లెంత్ హెల్ప్ అయింది, కానీ మావాళ్లు ప్లాన్స్ సరిగ్గా అమలు చేయలేదు.. రన్ చేజ్ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉండాలి.. మా ప్లానింగ్ మొత్తం దారుణంగా ఫెయిల్ అయిందన్నాడు. 

పవర్‌ప్లేలనే డగౌట్ కి క్యూ: 
ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 201-7 భారీ స్కోరు కొట్టింది. వాళ్ల ఓపెనర్ ఫిల్ సాల్ట్ (70 రన్స్) ఒక్కడే కొట్టిన స్కోరును.. టీమ్ మొత్తం కలిసి కూడా దాటలేకపోయింది. 12 ఓవర్లు కూడా తిరక్కుండానే ఇండియా 76 పరుగులకే ఆలౌట్ అయింది. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని ఆర్చర్ ఒక 90 mph బౌన్సర్‌తో భయపెట్టిండు, ఆ నెక్స్ట్ బాలే అతడు సిక్స్ కొట్టినా.. ఆ తర్వాత ఆర్చర్ వేసిన బౌన్సర్‌కే కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిండు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కెప్టెన్ అయ్యర్, అక్షర్ పటేల్.. అంతా క్యూ కట్టేసరికి 5 ఓవర్లకే ఇండియా 25 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్ వర్మ స్టంపౌట్ కాగా.. హోమ్ గ్రౌండ్‌ల ఆడుతున్న జోష్ టంగ్ (4–28) శివమ్ దూబే, హర్షిత్ రాణాలను అవుట్ చేసి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. భారత్ తన లోయెస్ట్ స్కోరు (74 రన్స్) ను దాటితే చాలు అన్నట్టుగా బ్యాటింగ్ చేసింది.

హ్యారీ బ్రూక్ సేన హవా: 
ఇంకోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. సాల్ట్ కిరాక్ ఇన్నింగ్స్ ఆడిండు. ఇలాంటి వికెట్ మీద 200+ కొట్టడం మామూలు ముచ్చట కాదు.. మా బౌలర్లకు మేమేం పెద్దగా ఏం చెప్పలేదు.. టాప్ ఆఫ్ ది స్టంప్స్ హిట్ చేయమన్నం, మధ్య మధ్యలో బౌన్సర్లు వేయమన్నం.. ఆ సింపుల్ ప్లాన్ పక్కా వర్కవుట్ అయిందని బ్రూక్ చెప్పుకొచ్చాడు.  

బ్రిస్టల్‌లో డూ ఆర్ డై మ్యాచ్: 
గత నెలల ఐర్లాండ్‌తోని సిరీస్ ఓడిపోయిన మనోళ్లకు, ఇదో పెద్ద షాక్. ఈ ఘోర పరాజయం 2019లో న్యూజిలాండ్‌పై ఎదురైన 80 రన్స్ ఓటమి రికార్డును కూడా తుడిచేసింది. ఇక గురువారం బ్రిస్టల్‌ల జరిగే నాలుగో టీ20లో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ వాళ్ల సొంతమవుతుంది. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇంకా హోప్స్ వదులుకోలేదు. స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఇదో మంచి ఛాన్స్.. జరిగిపోయిన దాన్ని పట్టుకొని ఏడవడం కంటే.. దారుణంగా ఆడినా కూడా ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సింది మస్తు ఉందని చెప్పుకొచ్చాడు. మరి నెక్స్ట్ మ్యాచ్‌లైనా భారత్ పుంజుకుంటుందో లేదో..   

 

©️ VIL Media Pvt Ltd.