EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్న్యూస్.. వడ్డీ జమ తేదీ ఫిక్స్.. రూ.5 లక్షల వరకు ఆటో క్లెయిమ్

దేశంలోని 8 కోట్ల పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. పీఎఫ్ వడ్డీ డబ్బులను జమ చేసేందుకు తేదీ ఖరారు చేసింది. ఈ వడ్డీ ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలో జమ కానుంది. ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలో 8.25 శాతం జమ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూలై 15వ తేదీ నాటికి పీఎఫ్ డబ్బులను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే ఉద్యోగులకు మరో గుడ్న్యూస్ తెలిపింది. 5 లక్షల రూపాయల వరకు పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చని ప్రకటించింది.
ఈపీఎఫ్లో కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం తీసుకున్న చర్యలతో ఇప్పుడు ఉద్యోగులకు పీఎఫ్ సేవలు మరింత సులభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఒకే డేటాబేస్లో పీఎఫ్ వివరాలు ఉండనున్నాయి. సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా బదిలీ ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
ఈ సంస్థ వచ్చే వారంలోగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 34 కోట్లకు పైగా ఖాతాలకు రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీని జమ చేయడం ప్రారంభించనుంది. ఇప్పుడు పీఎఫ్ క్లెయిమ్లు మరింత సులభతరం కానుంది. దేశ వ్యాప్తంగా ఏ ఈపీఎఫ్వో ఆఫీస్ నుంచైనా సేవలు పొందవచ్చు.