O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!

హీరో తిరువీర్, వెర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ..! సుకుమారి’. ‘శివం భాజే’ సినిమా తర్వాత గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ దర్శన్ కథ, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను టాలీవుడ్ హిట్ మెషిన్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా లాంచ్ చేశారు. రొమాన్స్, పల్లెటూరి అందాలు మరియు హిలేరియస్ కామెడీతో కూడిన ఈ ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వుల పండగ గ్యారెంటీ అనిపిస్తోంది.
ట్రైలర్ ప్రకారం.. ఊరిలో దామిని (ఐశ్వర్య రాజేష్) అంటే అందరికీ ఒక తెలియని భయం ఉంటుంది. దానికి కారణం ఆమెకు ఒక వింత సమస్య ఉండటమే. ఆమెను ఎవరైనా తాకితే చాలు.. అల్లాడిపోయేలా కరెంట్ షాక్ తగులుతుంది. ఈ విచిత్రమైన రహస్యాన్ని ఊరంతా దాచిపెట్టి, అమాయకుడైన మన హీరో (తిరువీర్)కు ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి పీటలెక్కిన తర్వాత అసలు విషయం తెలిసిన ఆ కొత్త మొగుడు ఎలాంటి తిప్పలు పడ్డాడు? ముట్టుకుంటే షాక్ కొట్టే భార్యతో కాపురం ఎలా చేశాడు? చివరికి ఈ విచిత్రమైన సమస్యను ఈ భార్యాభర్తలు ఎలా ఎదుర్కొని ఒక్కటయ్యారు? అనే వినూత్నమైన కాన్సెప్ట్తో దర్శకుడు భరత్ దర్శన్ ఈ కథను అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎలిమెంట్స్తో సిద్ధం చేశారు. తిరువీర్ మరోసారి ఒక సరికొత్త తరహా కథను ఎంచుకుని, అమాయకమైన పల్లెటూరి యువకుడి పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోయారు. కామెడీ టైమింగ్తో ఆయన పండించిన నవ్వులు ట్రైలర్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఐశ్వర్య రాజేష్ కూడా గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్తో మెప్పించింది. ఇక మురళీధర్ గౌడ్, ‘మ్యాడ్’ ఫేమ్ విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆమని, ఆనంద్కోట జయరామ్ తమ మార్క్ కామెడీతో వినోదాన్ని నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లారు.