
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కొండిగారి రాములు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో రాములు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన రెండు సార్లు సిపిఎం పార్టీ నుంచి గెలిచి ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎగా ప్రజలకు సేవలందించారు. కొద్దిసేపటి క్రితం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు.