
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రతి బుధవారం బంద్ ఉంటుందని మార్కెట్ సెక్రటరీ మల్లేశం సోమవారం ఒక ప్రకటలో తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున రైతులు, వ్యాపారులు, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సరుకుల వేలం పాట సమయాల్లో మార్పుతో పాటు, ప్రతి బుధవారం మార్కెట్ బంద్ ఉంచుతున్నట్టు తెలిపారు. 23వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ అమలులోకి వస్తుందని ప్రకటించారు. రైతులు ఈ మార్పులను గమనించి బంద్ రోజుల్లో సరుకులు తెచ్చి ఇబ్బందులు పడొద్దని సెక్రటరీ మల్లేశం కోరారు.