Reading Time: 2 minutes

దేవడా.. ఏంటీ గోల : ప్రధాని మోడీ ప్రసంగంపై పోటెత్తిన సోషల్ మీడియా మీమ్స్

Caption of Image.

ఈ రాత్రి అంటే.. 2026, ఏప్రిల్ 18వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోడీ.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా పోటెత్తింది. మీమ్స్ రెచ్చిపోయారు నెటిజన్లు. కరోనా సమయంలో మోడీ ప్రసంగాలను గుర్తు చేసుకున్నారు. లాక్ డౌన్ విషయం నెటిజన్ల బుర్రల్లో గుర్తు చేసింది. అంతేనా నోట్ల రద్దు అంశంతో సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. 

టాప్ మీమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…

రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోడీ.. మిత్రోన్ అంటూ ప్రారంభిస్తారంటూ కామెంట్ చేశారు.. అవునా.. కాదా మిత్రులారా అంటూ ఫన్నీ మీమ్ క్రియేట్ చేశారు.

మరో నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు. మహా భారతంలో ద్రౌపది చీర లాగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలు పాపం చేశాయి.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించి.. దేశంలోని మహిళలను అవమానించారంటూ ప్రసంగం ఉంటుందని ఊహిస్తూ.. మహాభారత సన్నివేశాన్ని పోస్ట్ చేశాడు.

మరో నెటిజన్ అయితే 2016లో నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా రాత్రి 8 గంటల 30 నిమిషాలకే ప్రసంగించారు.. ఈసారి ఏం జరగబోతుంది.. అంతకంటే పెద్దదే ఉండొచ్చు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మీమ్ పోస్ట్ చేశాడు.

మరో నెటిజన్ స్పందన ఇలా ఉంది. ప్రధాని మోడీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మాట్లాడుతున్నారంటే అది చాలా పెద్ద విషయం అయ్యి ఉండొచ్చు.. లేక 18 ఏళ్ల IPL హిస్టరీ గురించి కూడా అయ్యి ఉండొచ్చు అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

మరో నెటిజన్ అయితే ఇది చాలా పెద్ద విషయం.. మార్కెట్ లో ఇప్పుడు బుల్స్ అండ్ బేర్స్ ఉన్నాయి.. జనానికి ఉపశమనమా లేక ఒత్తిడికి గురి చేసేదా అనే బాధతో.. సినిమా సన్నివేశాలను జోడిస్తూ మీమ్ క్రియేట్ చేశాడు..

మొత్తానికి ప్రధాని మోడీ రాత్రి ప్రసంగంపై సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. ఎవరికి తోచిన రీతిలో.. ఎవరికి వాళ్లు మీమ్స్ తో తమ అభిప్రాయాలను ఫన్నీగా పంచుకోవటం విశేషం.

©️ VIL Media Pvt Ltd.