
MK Stalin: తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా, సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మదురైలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మదురైని మణిపూర్లా మార్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. మదురైలో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ వివాదాన్ని స్టాలిన్ ప్రస్తావించారు.
Read Also: New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్పై అప్డేట్..
మదురై హైకోర్టు, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని డీఎంకే సర్కార్ సవాలు చేసింది. ఈ వివాదం గురించి స్టాలిన్ ప్రస్తావించారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు. “శాంతి, సౌభ్రాతృత్వం తమిళనాడు డీఎన్ఏ. కానీ ఎన్డీఏ దీనిని నాశనం చేయాలనుకుంటోంది,” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీది ‘‘విభజనవాద ఆర్య నమూనా’’ అని అన్నారు. మదురైని మణిపూర్ చేయాలని చూస్తోందని ఆరోపించారు.
పన్నుల రూపంలో కేంద్రానికి తమిళనాడు ఎన్నో రూపాయలు చెల్లిస్తోందని, కానీ తిరిగి ఇచ్చే డబ్బులు మాత్రం తక్కువ అని విమర్శించారు. తమిళనాడు దివాలా తీస్తుందని బీజేపీ ఆరోపిస్తోందని,అయితే దివాలా తీసేది మాత్రం ఎన్డీయే అని స్టాలిన్ ఎద్దేవా చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.