Reading Time: 2 minutes
Lokesh Kanagarajs Crime Action Drama Dc Streaming On To Sun Nxt

DC OTT Release: దర్శకుడిగా స్టార్‌డమ్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా పరిచయమైన ‘డీసీ’ క్రైమ్ యాక్షన్ డ్రామా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటించారు. విడుదలకు ముందే భారీ బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విషయంలోనూ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ‘డీసీ’ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Sun NXT సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే థియేటర్లలో సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత Sun NXT వేదికగా ‘డీసీ’ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

ఇక సినిమా విషయానికి వస్తే, ‘డీసీ’లో లోకేష్ కనగరాజ్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దర్శకుడిగా యాక్షన్, క్రైమ్ కథలను తెరకెక్కిస్తూ తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు అదే తరహా యాక్షన్ తో హీరోగా ఎలా మెప్పిస్తారన్నది ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు ‘రాకీ’, ‘సాని కాయిదం’, ‘కెప్టెన్ మిల్లర్’ వంటి విభిన్నమైన క్రైమ్, యాక్షన్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన వెంటనే ‘డీసీ’కి విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఏడాది కోలీవుడ్‌లో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పలువురు క్రిటిక్స్ ఈ సినిమాను ప్రశంసించినట్లు సమాచారం. కథనం, యాక్షన్ ట్రీట్‌మెంట్, నటీనటుల ప్రదర్శనతో పాటు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వ శైలికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. దీంతో ‘డీసీ’కి థియేట్రికల్ రిలీజ్‌తో పాటు ఓటీటీ మార్కెట్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడిగా ఇప్పటికే భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ఎంతవరకు మెప్పించారన్నది ఒకవైపు ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మరోవైపు సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు Sun NXT ఓటీటీ వేదిక కూడా ఖరారైంది. డిజిటల్ ఆడియన్స్ కోసం స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.