
Alluri District Tribal Bandh: ఆదివాసీల బంద్ తో అల్లూరి సీతారామరాజు జిల్లా స్తంభించింది. వ్యాపార, పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. GO నెం.3 కి ప్రత్యామ్నాయం, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయడం, బాక్సైట్ తవ్వకా లు, హైడ్రో పవర్ ప్లాంట్స్ అనుమతులు రద్దు ప్రధాన డిమాండ్ల సాధన కోసం
ఈ బంద్ సాగుతోంది.
అందిన సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీల బందులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాడేరులో ఆర్టీసి డిపో ఎదుట బయటాయించిన ఆదివాసిలని పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో పోలీసులతో ఆదివాసి జేఎసి నేతలు వాగ్వాదానికి దిగారు. కాసేపు పోలీసులు ఆదివాసి జేఎసి నేతల మధ్య తోపులాట జరిగింది. ఆదివాసి జేఏసి బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పాడేరులో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఏజెన్సీలోని 11 మండల కేంద్రాల్లో బందు ప్రశాంతంగా కొనసాగుతుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలోని 11 మండలాల్లో భారీగా పోలీసులు మోహరించారు. వాహనాల్ని ముమ్మరంగా తనికీ చేస్తున్నారు.
ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేనందున ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలకు సిద్ధమని అధికార యంతరంగం ప్రకటించడంతో ఆదివాసి సంఘాల బంద్ కాస్త ఉదృతంగా కొనసాగుతుంది. న్యాయ సమీక్షలో రద్దైన జీఓ నెంబర్ మూడుని పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసి సంఘాల నేతలు. 1/70 యాక్ట్ ద్వారా భూ బదలయింపు చట్టం పటిష్టంగా అమలు చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బాక్సెట్ తవ్వకాలకు అనుమతులు నిలిపి వేయాలని, అల్లూరు జిల్లాను జోన్ 1లో ఉంచాలని ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. ఆదివాసి జేఎసి బందుకు వైసపి వామపక్ష పార్టీలు వర్తక వ్యాపార సంఘాలు మద్దతు ప్రకటించాయి. బందు ప్రభావంతో పర్యాటక కేంద్రం అరకు వ్యాలీ మూతబడింది. టెట్ ఎగ్జామ్స్ కారణంగా ఉదయం 10 గంటల వరకు బస్సుల రాకపోకలకు మినహాయింపు ఇస్తున్నట్టు ఆదివాసి జేఎస్సి ప్రకటించింది.