Reading Time: < 1 minute
Tollywood Event Controversy Dil Raju Skips Sitting On Chair After Incident At Naga Chaitanya Event

మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా టాలీవుడ్‌లో ఈవెంట్లను నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు సినిమా షూటింగ్ దగ్గరే కవరేజ్ చేసి ప్రింట్ మీడియా ద్వారా ప్రేక్షకుల దృష్టికి తీసుకువెళ్లేవాళ్లు. కాలక్రమేణా ఈవెంట్ల సంస్కృతి వచ్చింది. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం ఆడియో రిలీజ్ ఈవెంట్ మాత్రమే నిర్వహించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కొన్ని సాంగ్స్ రిలీజ్ ఈవెంట్లతో సహా, టీజర్ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, అవసరమైతే రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్లు కూడా చేస్తున్నారు.

Also Read :Brahmanandam: రెహ్మాన్ డకాయిట్’తో ఖాన్ దాదా సిట్టింగ్ వేస్తే ?

అలా ఈ మధ్య కాలంలో నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో, నాగచైతన్య కూర్చున్న కుర్చీ స్లిప్ అయ్యి అమాంతం వెనక్కి పడిపోయాడు. ఈ క్రమంలోనే ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు అదే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మరోసారి అవే కుర్చీలను మరో ఈవెంట్‌లో రిపీట్ చేసింది. తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘గాయపడ్డ సింహం’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడికి కూడా ఆ రోజు వాడిన కుర్చీలనే తీసుకొచ్చారు. ఈ విషయం అర్థమైన వెంటనే దిల్ రాజు కనీసం ఆ కుర్చీలలో కూర్చోవడానికి కూడా ఇష్టపడకుండా, “ఇప్పుడు కుర్చీలతో పనేముంది” అంటూ త్వరత్వరగా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక స్టార్ హీరో కుర్చీ స్లిప్ అయి పడిపోయినప్పుడు, కనీసం ఆ కుర్చీలను మళ్లీ రిపీట్ చేయకూడదని జ్ఞానం కూడా లేకుండా, మళ్ళీ వాటినే వాడటంపై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.