Reading Time: < 1 minute
Ram Charans Peddi Buchibabu Sana Plans Four To Five Heroines For Special Song

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రతి అంశం చాలా స్పెషల్‌గా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read : Kiran Abbavaram : డైరెక్టర్ గా మారుతున్న కిరణ్ అబ్బవరం

సాధారణంగా సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటే ఒకరు లేదా ఇద్దరు భామలు మెరుస్తుంటారు. కానీ బుచ్చిబాబు ఆలోచన మాత్రం చాలా వెరైటీగా ఉందట. ఈ పాటలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు లేదా ఐదుగురు క్రేజీ హీరోయిన్లను నటింపజేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. ఈ ఐడియా కనుక వర్కవుట్ అయితే రామ్ చరణ్ పక్కన అంతమంది తారలు కలిసి చేసే సందడి థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. అయితే, ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్‌కు సంబంధించిన ఇతర పనుల్లో బిజీగా ఉంది. ముందుగా పెండింగ్ వర్క్ అంతా పూర్తి చేసిన తర్వాతే, ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణపై దృష్టి సారించాలని యూనిట్ నిర్ణయించుకుంది. ఈ పాట కోసం ఎవరెవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ అద్భుతంగా వస్తున్నాయని సమాచారం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.