Reading Time: < 1 minute
Excess Salt In Biryani Leads To Brutal Murder Of Wife In Mumbai

Crime: ముంబైలో ఓ మహిళ హత్య సంచలనంగా మారింది.. బైంగన్వాడి ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆశ్చర్యకరంగా, ఈ ఘటనకు “బిర్యానీలో ఎక్కువ ఉప్పు” అని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మృతురాలి కుటుంబం, నజియా పర్వీన్ పోలీసులకు మాట్లాడుతూ, ఇది కేవలం ఒక రాత్రిలో జరిగిన ఘటన కాదంటున్నారు.. నజియా, మంజార్ రెండేళ్ల క్రితం, అక్టోబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు.. కానీ, వివాహం తర్వాత మంజార్ ప్రవర్తన మారిపోయింది. అతను తరచుగా చిన్న చిన్న విషయాలకే నజియాపై చేయి చేసుకునేవాడు.. దాదాపు మూడు నెలల క్రితం, మంజార్ క్రూరత్వం యొక్క అన్ని పరిమితులను కూడా దాటాడు, నజియాపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె పన్ను కూడా విరిగింది.

Read Also: Shivaji: అనసూయకు శివాజీ స్ట్రాంగ్ కౌంటర్: “నీ రుణం తీర్చుకుంటా..!” అసలు వివాదంలోకి ఆమె ఎందుకు వచ్చిందంటూ సంచలనం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన జరిగిన డిసెంబర్ 20వ తేదీ రాత్రి, నాజియా ఇంట్లో బిర్యానీ తయారు చేసింది. మంజార్ తినడానికి కూర్చున్నప్పుడు, బిర్యానీలో ఉప్పు గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఆ వాదన తీవ్రంగా మారిపోయింది.. మంజార్ సహనం కోల్పోయి నాజియా తలను గోడకు బలంగా మోదాడు. తలకు తీవ్ర గాయాలు, అధిక రక్తస్రావం కారణంగా నాజియా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.. ఇక, ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న శివాజీ నగర్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. నిందితుడైన భర్తపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సంబంధిత సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న మంజార్ ఇమామ్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.