Reading Time: < 1 minute
Amaravati Legal Status Puts More Pressure On Andhra Pradesh Government

Amaravati Capital Development: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు.. నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అయితే, అమరావతి.. చట్టబద్ధత బిల్లుకు ఆమోదం రావడంతో ప్రభుత్వం పై మరింత బాధ్యత పెరగనుంది. బాధ్యత పెరగడమే… కాదు. ఒత్తిడి కూడా పెరుగుతోంది.. కూటమి ప్రభుత్వం. అమరావతి.. నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణాలు ఒక టైం లైన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి.. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్లు.. ట్రంక్ రోడ్లు.. అమరావతి లే ఔట్లు.. ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి.. అటు ఇటుగా ఒక రెండేళ్ల టైం బాండ్ లో వీటి నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది.. 2028 మే నుంచి.. ఆగస్టు లోపు. ఈ నిర్మాణాలు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది… అయితే, ఇప్పుడు అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంతో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత గా పెరుగుతోంది..

ఇప్పటి వరకు చట్టబద్ధత లేకపోవడంతో ప్రభుత్వం రాజధాని పనుల విషయంలో ఒత్తిడి పెంచలేదు.. కానీ, ఇప్పుడు… చట్టబద్ధత రావడం ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది… రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఏపీకి సరైన రాజధాని లేదు.. గత ప్రభుత్వంలో రాజధాని విషయంలో జరిగిన తప్పులను ప్రభుత్వం పదే పదే ఎత్తి చూపుతోంది.. దీంతో… ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై రాజధాని పూర్తి చేసే బాధ్యత పడింది.. అందులోనూ కూటమి అధికారం లోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తి కాలేదు.. మూడేళ్లకు పైగా టైం ఉంది.. దీంతో, ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. రాజధాని పనులు త్వరగా పూర్తి చేసి.. ప్రధాని మోడీని మరోసారి రాష్ట్రానికి పిలిపించే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

అమరావతి రాజధాని పనులు నిరంతర ప్రక్రియ అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు… అంటే.. ఈ మూడేళ్లలో కొన్ని నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉంది.. మిగిలినవి ఇంకా టైం పట్టె పరిస్థితి కనిపిస్తోంది.. మరి, అమరావతి చట్టబద్ధత గెజిట్ వచ్చాక.. ప్రభుత్వం రాజధాని విషయంలో ఇంకెంత దూకుడుగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది..