
రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీలు) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు జులై 15 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 14.
పోస్టు పేరు: సెక్షన్ కంట్రోలర్.
మొత్తం పోస్టులు: 119. సికింద్రాబాద్ పరిధి దక్షిణ మధ్య రైల్వేలో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 15.
లాస్ట్ డేట్: ఆగస్టు 14.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rrbcdg.gov.inను సందర్శించండి.