
Virat Kohli: క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్ మస్ట్-విన్ మ్యాచ్లో టీమిండియా అమ్మాయిలను ఉత్సాహపరిచేందుకు ఒక క్రేజీ సర్ప్రైజ్ గెస్ట్ జంట గ్రౌండ్ లోకి వచ్చింది. ఇండియన్ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఆదివారం లార్డ్స్ స్టాండ్స్లో సందడి చేశారు. ప్రస్తుతం లండన్లోనే సెటిల్ అయిన కోహ్లీ ఫ్యామిలీ.. సెమీస్ బెర్త్ కోసం పోరాడుతున్న ‘ఉమెన్ ఇన్ బ్లూ’ జట్టుకు సపోర్ట్ చేయడానికి ఇలా స్టేడియానికి రావడం ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేసింది.
రవిశాస్త్రితో కలిసి కోహ్లీ సందడి:
విరాట్ కోహ్లీ, అనుష్కలతో పాటు భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రి కూడా స్టాండ్స్లో కూర్చుని మ్యాచ్ను వీక్షించడం విశేషం. రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్గా, విరాట్ కెప్టెన్గా ఉన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ క్రేజీ బాండింగ్ నెలకొంది. లార్డ్స్ హాస్పిటాలిటీ ఎన్క్లోజర్లో కూర్చున్న కోహ్లీ గ్లాసెస్ పెట్టుకుని స్ట్రైప్డ్ షర్ట్లో క్యాజువల్ లుక్లో కనిపించగా.. అనుష్క శర్మ లైట్ బ్లూ స్లీవ్లెస్ టాప్, నేవీ క్యాప్ ధరించి మ్యాచ్ను ఎంతో ఇంట్రెస్ట్గా ఫాలో అయ్యారు.
నెట్టింట ఫోటోలు వైరల్:
భారత ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో టీమిండియా అమ్మాయిలు ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే విరాట్ కోహ్లీ, అనుష్కలు ఇచ్చిన రియాక్షన్లు, సంబరాలు టీవీ కెమెరాల్లో పదే పదే కనిపించాయి. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొడుతున్నప్పుడు ఈ స్టార్ కపుల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral) అవుతున్నాయి. మహిళల జట్టుకు మద్దతుగా నిలిచినందుకు నెటిజన్లు విరాట్, అనుష్కలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.