మటన్ కర్రీ చాలా టేస్టీగా రావాలి అంటే, అందులో తప్పకుండా మసాలాలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఉండాలి. ముఖ్యంగా మటన్ కర్రీని ముందుగా మ్యారినెట్ చేసి పెట్టాలి. తర్వాత నూనె పోసి కర్రీ వండుకోవాలి. దీని వలన ముక్క మెత్తగా ఉడికి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.
అయితే చాలా మంది చేసే అది పెద్ద పొరపాటు ఏమిటంటే? మటన్ వండే సమయంలో కూరను ఫ్రిజ్లో నుంచి తీసి వండుతారు. కానీ ఇలా అస్సలే చేయకూడదంట. దీని వలన మటన్ త్వరగా ఉడకదు. అంతే కాకుండా కొందు గ్యాస్ మంట ఎక్కువగా, హై ఫ్లేమ్లో పెట్టి ఉకిస్తారు, కానీ ఇలా చేయడం వలన మటన్ రబ్బర్లా ఉంటుంది. ముక్క కాస్త ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలంట. దీని వలన ముక్క త్వరగా ఉడుకుతుంది.
అలాగే చాలా మంది మటన్ ఉడికించడానికి అందులో చల్లటి నీటిని పోస్తారు. కానీ ఇలా చేయడం వలన మటన్ త్వరగా ఉడకదు, అందువలన మటన్ ఉడకబెట్టడానికి గోరు వెచ్చటి నీరు లేదా వేడి నీరు పోయాలి. దీని వలన మటన్ చాలా త్వరగా ఉడికిపోద్దీ.
ముఖ్యంగా ఉప్పు విషయంలో చాలా మందిలో ఒక గందరగోళం ఉంటుంది. అసలు మటన్ వడే క్రమంలో ఉప్పు ఎప్పుడు వేయాలి అని? ఎందుకంటే పెద్దవారు చెబుతుంటారు, ఉప్పు ముందుగా వేయకూడదు, దీని వలన మటన్ త్వరగా ఉడకదు అని, మరి మటన్ వండేటప్పుడు ఉప్పుడు ఎప్పుడు వేయాలి అంటే?
మటన్ 80 శాతం ఉడికిన తర్వాత ఉప్పు వేయాలంట. అంటే దాదాపు కర్రీ దగ్గర పడుతున్న సమయంలో, దీని కంటే ముందు ఉప్పు వేయడం వలన ముక్క గట్టి పడిపోతుంది. అంతే కాకుండా డ్రై అయిపోయింది. త్వరగా ఉడకదు, అందువలన మటన్ దాదాపు ఉడికిపోయింది అనే సమయంలో ఉప్పు వేయడం వలన కర్రీ టేస్టీగా ముక్క మెత్తగా ఉంటుందంట.




