Reading Time: < 1 minute
Nag Ashwin: శుభవార్త చెప్పిన ‘కల్కి’ డైరెక్టర్.. మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నాగ్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు సాధించింది. ఇక ప్రభాస్ హీరోగా అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898ఏడీ’ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. 2024లో రిలీజైన ఈ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో బిజిగా ఉన్న నాగ్ అశ్విన్ ఒక తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఒక శుభవార్త చెప్పాడు. తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన భార్య ప్రియాంక ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోని పంచుకున్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నాగ్ అశ్విన్- ప్రియాంక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా షూటింగ్ టైమ్ లోనే నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంకతో ప్రేమలో పడ్డారు నాగ్ అశ్విన్. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2015లో పెళ్లిపీటలెక్కారు. వీరికి 2017లో కొడుకు పుట్టాడు. కాగా తనకు డైరెక్టర్ గా గుర్తింపు తీసుకొచ్చిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకు పెట్టిన రిషి అనే పేరుని నాగ్ అశ్విన్ తన కుమారుడికి పెట్టడం విశేషం. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతుండడంతో నాగ్ అశ్విన్- ప్రియాంక ఆనందంలో మునిగి తేలుతున్నారు.

భార్య, కుమారుడితో డైరెక్టర్ నాగ్ అశ్విన్..

 

View this post on Instagram

 

A post shared by nagi (@nag_ashwin)

కాగా కేవలం డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు నాగ్ అశ్విన్. అందులో భాగంగానే జాతిరత్నాలు సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఇక రీసెంట్ గా సింగ్ గీతం అనే సినిమాను కూడా నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by nagi (@nag_ashwin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.