మన శారీరక, మానసిక ఆరోగ్యానికి సరైన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యం. మన శరీరంలో సుమారు 60 శాతం నీరే ఉంటుంది కాబట్టి, బాడీలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అయితే ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడిలో పడి నీళ్లు తాగడం పూర్తిగా మర్చిపోతున్నారు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్కు గురై పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు తక్కువైతే మన శరీరం ఎలాంటి హెచ్చరిక సంకేతాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు పెరగడం మరియు ఊబకాయం: తక్కువ నీరు తాగడం వల్ల ఊబకాయం లేదా స్థూలకాయం సమస్య మరింత పెరుగుతుంది. చాలా సార్లు మనం ఆహారం ఎక్కువగా తింటాం కానీ, దానికి సరిపడా నీళ్లు తాగం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఆకలి మరింత ఎక్కువగా వేస్తుంది. ఇక దీనివల్ల మనం అవసరానికి మించి ఆహారం తినేసి, అనవసరంగా బరువు పెరిగిపోతాం. ఒళ్లు రాకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం ఎంతో అవసరం.

వేధించే ఉదర సమస్యలు: శరీరంలో నీటి స్థాయులు తగ్గడం వల్ల మలబద్ధకం వంటి పొట్టకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. తగినంత నీరు లేకపోతే కడుపులో యాసిడ్ (ఆమ్లం) స్థాయులు పెరిగిపోయి గ్యాస్ తయారవుతుంది. ఇక ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేయడమే కాకుండా, గుండెల్లో మంటకు కూడా దారితీస్తుంది. కాబట్టి కడుపు ప్రశాంతంగా ఉండాలంటే నీళ్లను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
నోటి దుర్వాసన ఇబ్బంది: నీరు తక్కువగా తాగడం వల్ల నోరు త్వరగా ఎండిపోతుంది. లాలాజలం సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు నోటిలో హానికర బ్యాక్టీరియా చేరిపోతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల నోటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం మొదలవుతుంది. ఇక నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బంది కలిగించే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రోజంతా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి
ఇక పని ఎంత ముఖ్యం అయినా సరే, ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం మన బాధ్యత. అందుకే దాహం వేసే వరకు ఆగకుండా, రోజంతా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. మన శరీరం ఇచ్చే ఇలాంటి వార్నింగ్ సిగ్నల్స్ గ్రహించి వెంటనే అలర్ట్ అవ్వడం ఎంతో మంచిది.
గమనిక: రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకవేళ పైన పేర్కొన్న సమస్యలు నీళ్లు ఎక్కువగా తాగినప్పటికీ తగ్గకపోతేవెంటనే వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
The post నీళ్లు తక్కువగా తాగుతున్నారా?.. శరీరం ఇస్తున్న వార్నింగ్ సిగ్నల్స్ ఇవే appeared first on Manalokam – Latest Telugu News & Updates.