Reading Time: 2 minutes
Jyeshtha Purnima: జ్యేష్ఠ పూర్ణిమ.. మీ రాశికి ఏం దానం చేయాలి? ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం!

హిందూ సంప్రదాయంలో జ్యేష్ఠ మాస పౌర్ణమికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు చంద్రుడు తన 16 కళలతో సంపూర్ణ కాంతిని వెదజల్లుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన పర్వదినం శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి, కుబేర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఏడాది జూన్ 29, సోమవారం జ్యేష్ఠ పూర్ణిమ వచ్చింది. ఈ సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేసి, విష్ణు-లక్ష్మీ దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పూజ అనంతరం తమ రాశిని బట్టి దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని జ్యోతిష్య విశ్వాసం.

ద్వాదశ రాశుల వారు ఏం దానం చేయాలి?

  • మేష రాశి: మేష రాశికి కుజుడు అధిపతి. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు, బియ్యం, పప్పులు, శనగలు, పాయసం దానం చేయడం శుభప్రదం. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం.
  • వృషభ రాశి: పెరుగు, నెయ్యి, పంచదార, వెన్న దానం చేయాలి. దీని వల్ల శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.
  • మిథున రాశి: గోమాతకు పచ్చి గడ్డి వేయడం, గోశాలకు విరాళం ఇవ్వడం శుభకరం. అలాగే పాలు లేదా బియ్యం దానం చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉందని చెబుతారు.
  • కర్కాటక రాశి: పాలు, పెరుగు, అన్నం, పంచదార దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, కుబేరుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
  • సింహ రాశి: గోధుమలు, బెల్లం దానం చేయడం ద్వారా శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించి, గ్రహస్థితులు అనుకూలంగా మారుతాయని విశ్వసిస్తారు.
  • కన్య రాశి: సీజనల్ పండ్లు, కూరగాయలు, బియ్యం దానం చేయడం శుభప్రదం. దీని వల్ల విష్ణుమూర్తి కటాక్షం లభిస్తుందని చెబుతారు.
  • తులా రాశి: తెల్లని వస్త్రాలు, అన్నదానం, అలాగే పాలు, బియ్యం, నెయ్యి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
  • వృశ్చిక రాశి: ఎరుపు రంగు దుస్తులు దానం చేయాలి. అలాగే పాదచారులకు పండ్ల రసం లేదా చల్లని పానీయాలు అందించడం శుభఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. దీని వల్ల గ్రహదోషాలు తగ్గుతాయని చెబుతారు.
  • ధనస్సు రాశి: కుంకుమ కలిపిన పాలను పేదలకు పంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం.
  • మకర రాశి: గొడుగు, చెప్పులు లేదా పాదరక్షలు దానం చేయాలి. అలాగే ప్రవహించే నీటిలో బియ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల దోషాలు తొలగి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
  • కుంభ రాశి: అన్నదానం, నల్ల నువ్వులు, నలుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.
  • మీన రాశి: మహాలక్ష్మీదేవిని పూజించి, బ్రాహ్మణులకు లేదా అర్హులైన వారికి పసుపు వస్తువులు, పుస్తకాలు, తేనే దానం చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల జీవితంలో శుభఫలితాలు, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వసిస్తారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)