
నెల్లూరు జిల్లా కోడూరు బీచ్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో సుఫియాన్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా.. ఓ బాలికను జాలర్లు రక్షించారు. మరో బాలిక కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు.
రొట్టెల పండుగ కోసం చిత్తూరు జిల్లా సోమల మండలం కందుకూరుకు చెందిన మహమ్మద్ రఫీ కుటుంబం నెల్లూరు వచ్చింది. సరదాగా గడిపేందుకు తల్లిదండ్రులతో కలిసి కొత్త కోడూరు బీచ్కు వెళ్లారు. బీచ్లో ఎంజాయ్ చేస్తుండగా అలల్లో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గత ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా.. ఇంకొకరిని రక్షించారు. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ఒకరి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.