
మెరుపు తీగైనా కాసేపు అలా కనిపిస్తోందేమో కానీ అనుష్క శెట్టిని ఆఫ్ స్క్రీన్ చూడాలంటే కళ్లు కాయలు కాయాల్సిందే. అనుష్క సినిమాలు చేస్తోంది కానీ ప్రమోషన్స్కు రాదు.. హీరోలే ఆ బాధ్యతలు తీసుకోవాలి. మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి నుండి ఇదే తంతు. ఘాటీ కోసం రానా, బన్నీలతో ఆడియో ఇంటర్వ్యూలిచ్చి సరిపెట్టేసింది. మీడియా కంటికి కనిపించదు. పోనీ సోషల్ మీడియాతోనైనా ఫ్యాన్స్ టచ్లో ఉంటుందా అంటే నెట్టింట్లో అసలు యాక్టివ్గానే ఉండదు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తప్ప.. మరో సమాచారం పంచుకోదు .
అనుష్కను ఎట్టకేలకు ఫ్యాన్స్ ముందుకు తెచ్చింది డాక్యుమెంటరీ సిరీస్ బాహుబలి ది టార్చ్ బేరర్. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న నేపథ్యంలో టీం మొత్తం తమ ఎక్స్ పీరియన్స్ పంచుకుంది. స్వీటీ కూడా తన అనుభవాలను షేర్ చేసుకుంది. ప్రభాస్, రానాతో కలిసి షూటింగ్ టైంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంది. ఈ డాక్యుమెంటరీలో అనుష్కతో పాటు ప్రభాస్ను చాలా రోజుల తర్వాత పక్క పక్కనే చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. డాక్యుమెంటరీ సిరీస్ కోసం ఆఫ్ స్క్రీన్లో అనుష్క తళుక్కున మెరిసింది కానీ ఇది గతంలో రికార్డ్ చేసిన వీడియో. అందులోను అనుష్క ఫేస్ స్వాప్ చేసారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ కథనార్తో మలయాళ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుష్క ఇక బయట కనిపించడం అనేది జరగదని చెప్తున్నారు. అందుకు ఇష్టపడట్లేదట స్వీటీ. తెలుగులోను ఇక సినిమాలు చేసే అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్.