
US-Iran Plan: మధ్యప్రాచ్యం సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ‘‘ఒప్పందం’’ కుదిరే అవకాశం కనిపిస్తోంది. తక్షణ కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందం ప్రకారం.. తక్షణ కాల్పుల విరమణ తర్వాత విస్తృతమైన, సమగ్రమైన ఒప్పందంతో కూడిన రెండు-దశల ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒప్పందంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘‘ఇస్లామాబాద్ ఒప్పందం’’ అని తాత్కాలికంగా పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
Read Also: PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏందయ్యా నువ్వు.. ఐపీఎల్పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!
అయితే, ఈ రెండు దశల ఒప్పందంలో 45 రోజుల కాల్పుల విరమణను పరిశీలిస్తున్నట్లు యాక్సియోస్ నివేదించింది. మంగళవారం నాటికి టెహ్రాన్ ఒప్పందానికి అంగీకరించి, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, ఇరాన్ ఇంధన మరియు రవాణా మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే తాత్కాలిక సంధి కోసం హార్ముజ్ తెరిచేది లేదని ఇరాన్ మధ్యవర్తులకు స్పష్టం చేసింది.