Reading Time: < 1 minute
Janhvi Kapoor Comments On Deep Fake Photo Experience At Age 15

టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం 15 ఏళ్ల వయసులో, ఆమె స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోను డీప్‌ ఫేక్ సాంకేతికతతో మార్చి ఒక అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని జాన్వీ తెలిపారు. ఆ సమయంలో తన స్నేహితురాలు ఈ విషయాన్ని చెప్పే వరకు తనకు ఏమీ తెలియదని, తీరా ఆ ఫోటో చూసిన తర్వాత ఏం చేయాలో పాలుపోక ఎంతో బాధపడ్డానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఆ చిన్న వయసులోనే సోషల్ మీడియాలో కనీస నైతికత ఉండదని తనకు అర్థమైందని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడే మానసికంగా సిద్ధమయ్యానని ఆమె పేర్కొన్నారు.

Also Read : Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

అందుకే ఇప్పుడు తనపై వస్తున్న డీప్‌ ఫేక్ ఫోటోలను లేదా ఇతర నెగటివ్ కామెంట్లను పెద్దగా పట్టించుకోనని జాన్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెలబ్రిటీలు ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని, అందుకే వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ ప్రస్తుతం తెలుగులో ‘పెద్ది’ (Peddi) సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ, రాబోయే చిత్రాలతో తన సత్తా చాటాలని చూస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా తోటి మహిళలకు, యువతకు ధైర్యాన్ని ఇస్తున్నారని నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.