Reading Time: < 1 minute
Stock Market Today Sensex Nifty Fall Trump Warning Iran Global Tensions

ట్రంప్ బెదిరింపులు కారణంగా గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. అయితే ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్‌కు 48 గంటల గడువు ఇచ్చారు. ఆలోపు ఒప్పందం చేసుకోకపోతే నరకం చూస్తారని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఒప్పందం కోసం మధ్యవర్తులు రంగంలోకి దిగడంతో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో మన మార్కెట్‌ కూడా సోమవారం ప్రారంభంలో లాభాలతో మొదలైంది. కానీ అంతలోనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 73, 103 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 22, 641 దగ్గర కొనసాగుతోంది.

నిఫ్టీలో ట్రెంట్, విప్రో, పవర్ గ్రిడ్ కార్ప్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటివి ప్రధానంగా లాభపడగా.. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ వంటివి నష్టపోయాయి.