
హైదరాబాద్, వెలుగు: టీ–20 క్రికెట్మ్యాచ్ల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారిక పేమెంట్స్ పార్ట్నర్గా నవీ యూపీఐ ఎంపికైంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా డిజిటల్ ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని పెంచాలని నవీ లిమిటెడ్ యోచిస్తోంది. వేగవంతమైన, సులభమైన చెల్లింపు సేవలను ప్రజలకు చేరువ చేయడమే తమ లక్ష్యమని నవీ లిమిటెడ్ ఎండీ రాజీవ్ నరేష్ తెలిపారు.
క్రికెట్ మ్యాచ్ తరహాలోనే యూపీఐ చెల్లింపుల్లోనూ తక్షణ వేగం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తక్షణ చెల్లింపులు, ఖర్చులను ట్రాక్ చేయడానికి తమ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.