Reading Time: < 1 minute
Mojtaba Khamenei Escapes Death Tehran Missile Strike Update

Mojtaba Khamenei: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా జరుపుతున్న యుద్ధంలో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి28న టెహ్రాన్‌పై జరిగిన వైమానిక దాడిలో అప్పటి సుప్రీం లీడర్, మొజ్తబా ఖమేనీ తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అయితే, అదే సమయంలో దాడి జరిగిన ప్రాంతానికి బయట ఉండటంతో మొజ్తబా ప్రాణాలు దక్కాయని తెలుస్తోంది.కొన్ని సెకన్ల వ్యవధిలోనే అతను మృత్యువు నుండి దూరమయ్యాడు. అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన క్షిపణి దాడిలో అలీ ఖమేనీ, అతడి కుటుంబ సభ్యులు మరణించారు.

Read Also: Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్

ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. దాడి జరగడానికి కొద్ది క్షణాల ముందే మొజ్తబా ఖమేనీ తన భవనం నుంచి బయటకు వెళ్లాడని తెలిసింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే క్షిపణి ఆ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక అధికారులు మొహమ్మద్ షిరాజీ కూడా మరణించనట్లు నివేదిక చెబుతోంది. ఈ దాడి కారణంగా భారీ విధ్వంసం జరిగినట్లు ఆడియో లీక్ వల్ల తెలిసింది. “మొజ్తబా ఏదో పని మీద ఆవరణలోకి వెళ్లి, ఆ తర్వాత తిరిగి రావడమే దైవ సంకల్పం,” అని ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ అధిపతి మజాహెర్ హొస్సేనీ, ఇరాన్ అధికారులతో ఒక ప్రైవేట్ సమావేశంలో చెప్పినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది.

ఈ దాడిలో ఒక క్షిపణి అలీ ఖమేనీ ఉన్న భవనాన్ని తాకగా, మరొకటి పై అంతస్తులో ఉన్న మొజ్తబా నివాసాన్ని తాకినట్లు నివేదిక పేర్కొంది. ఆ ప్రాంగణంలోని మొజ్తబా బావమరిది మిస్బా అల్-హుదా బఘేరి కనీ నివాసంపై మరో క్షిపణి దాడి చేసిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ క్షిపణి దాడిలో డెడ్ బాడీలు కూడా గుర్తించలేని విధంగా తయారైనట్లు చెప్పింది. మరోవైపు, దాడి వల్ల మొజ్తబా కోమాలో ఉన్నారని, అతడి కాలు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.