
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాదికి ఏడాది కావస్తున్న తరుణంలో ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంచలన ప్రకటన చేసింది. యూఎస్-ఇరాన్లకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్న ఈ తరుణంలో లష్కర్ కీలక ఉగ్రవాది, అగ్ర కమాండర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, పాకిస్తాన్కు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పరపతి ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని లష్కర్ ఉగ్రవాది అబూ ముసా కాశ్మీరీ అన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడి తర్వాతే పాకిస్తాన్ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరిగిందంటూ కామెంట్స్ చేశాడు.
Read Also: Abhishek Sharma History: పవర్ప్లేలో పవర్ హిట్టింగ్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ!
కాశ్మీర్లో ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి పాల్పడి 26 మందిని చంపేశారు. ఈ ఘటన తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పాక్ వైమానిక దళ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. తాజాగా లష్కరే తోయిబా కమాండర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్లు ఒప్పుకున్నట్లుగా తేలింది. అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. అమాయకులను చంపి దానిని దౌత్యవిజయంగా పాకిస్తాన్ చిత్రీకరిస్తుంది. అంతర్జాతీయ వేదికపై పాక్ శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తుందని నటిస్తున్నా, ఉగ్రవాదులు మాత్రం పాక్ నైజాన్ని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.