
PBKS vs SRH: ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ పై పంజాబ్ కింగ్స్ విజయాన్ని సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే 74 పరుగులతో విధ్వంసం సృష్టించగా, ట్రావిస్ హెడ్ (38), క్లాసెన్ (39) రాణించారు. పంజాబ్ బౌలర్లలో శశాంక్ సింగ్, అర్ష్దీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీశారు.
సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!
అయితే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్ను ఆరంభించింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కేవలం 20 బంతుల్లో 57 పరుగులు చేసి మెరుపు దాడి చేయగా, ప్రభ్సిమ్రాన్ సింగ్ (51) అర్ధశతకంతో అతనికి జత కలిశాడు. వీరిద్దరి ధాటికి పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మధ్యలో శివాంగ్ కుమార్ వరుసగా 3 వికెట్లు తీసి హైదరాబాద్ను రేసులోకి తెచ్చినా, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ను గెలిపించాడు. అయ్యర్ 33 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో శశాంక్ సింగ్ (16*) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 18.5 ఓవర్లలోనే 223 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.