Reading Time: < 1 minute
Stock Market Crash Sensex Nifty Fall Israel Iran Hormuz Tensions

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 986 పాయింట్లు నష్టపోయి 76, 576 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 240 పాయింట్లు నష్టపోయి 23, 753 దగ్గర కొనసాగుతోంది.

బుధవారం ఇరాన్‌తో 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ భారీ లాభాలు అర్జించింది. కానీ హిజ్బుల్లా ఉగ్రవాదులు లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ ఘటనలో 254 మంది చనిపోయారు. గురువారం కూడా మరోసారి ఇజ్రాయెల్ దాడి చేసింది. హిజ్బుల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్ కార్యదర్శిని హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అంతేకాకుండా తాజాగా మరోసారి ట్రంప్ హెచ్చరించారు. సరైనా ఒప్పందం చేసుకోకపోతే మునుపెన్నడూ లేనంతగా ఇరాన్‌పై దాడులు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొనడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

నిఫ్టీలో ఎల్ అండ్ టీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ వంటి ప్రధాన షేర్లు నష్టపోయాయి. హిండాల్కో, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, భారత్ ఎలక్ట్రానిక్స్, మాక్స్ హెల్త్‌కేర్ వంటి షేర్లు లాభపడ్డాయి.