Reading Time: < 1 minute
Ttd Laddu Sales Hit Record In 2025 26 Tirumala Prasadam Generates Rs 567 Crore

TTD Laddu Sales Record: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసిద్ధ లడ్డూ ప్రసాదానికి ఆదరణ ఎప్పుడూ తగ్గదు.. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో విశ్వాసం.. తిరుమల వెళ్తున్నారంటే.. నాకు లడ్డూ తీసుకురా అని చెప్పే భక్తులు ఎంతో మంది.. అయితే, 2025–26 వార్షిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిపి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించింది టీటీడీ.. ఇక, లడ్డూల విక్రయం ద్వారా సుమారు రూ.567 కోట్లు ఆర్జించింది టీటీడీ.. రోజువారీగా సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేసి, అదే స్థాయిలో విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.

Read Also: Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

కాగా, శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత కూడా విశేషం. 1790 నుంచి 1840 మధ్య కాలంలో తిరుమల ఆలయంలో లడ్డూ తయారీ ప్రారంభమైంది. మరాఠా రాజు రఘోజి భోంస్లే పాలనలో స్వామివారికి లడ్డూ ప్రసాదం నివేదించే సంప్రదాయం మొదలైందని చరిత్ర చెబుతోంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల లడ్డూ, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు దర్శనం అనంతరం ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. టీటీడీ నిర్వహణలో లడ్డూ తయారీ, నాణ్యత, పంపిణీ ప్రక్రియలు అత్యంత శ్రద్ధతో కొనసాగుతున్నాయి. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కూడా సరిపడా లడ్డూలను అందించడంలో టీటీడీ సమర్థంగా పనిచేస్తోంది. ఈ రికార్డు విక్రయాలు తిరుమల దేవస్థానం నిర్వహణ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాయి.