Reading Time: < 1 minute
Headmaster Caught By Acb While Accepting Bribe

పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు లంచావతారమేత్తాడు. ఏకంగా హెడ్మాస్టర్ లంచం తీసుకోవడంతో చర్చనీయాంశమైంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గూడూరు మండలం అయోధ్యపురంలో పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇన్చార్జ్ ఎంఈఓగా వ్యవహరిస్తున్న రవికుమార్ టీచర్ ఫైల్ క్లియర్ చేయడం కోసం డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడు రూ.15000 లంచమిస్తూ ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు హెడ్మాస్టర్ ను పట్టుకున్నారు. రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయుడి నుంచి ముడుపులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు హెడ్మాస్టర్ పట్టుబడడంతో కలకలం రేపింది. విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.