Reading Time: 2 minutes
Pm Modi Bjp Foundation Day Self Reliant India Goal

బీజేపీకి కార్యకర్తలే బలం అని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు.‘‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే విశాలమైన.. పవిత్రమైన మర్రిచెట్టు నీడలో స్వచ్ఛమైన సంకల్పంతో.. చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి అడుగుపెట్టే స్ఫూర్తిని మేము పొందాం. కొన్ని దశాబ్దాల పాటు సంస్థ కోసం విధానాలను రూపొందించడానికే మేము మా శక్తిని అంకితం చేశాం. ఆ తర్వాత బీజేపీ తనను తాను ఒక బలమైన, కార్యకర్తల ఆధారిత పార్టీగా తీర్చిదిద్దుకోవడంలో సర్వశక్తులూ ఒడ్డి కృషి చేసిన సమయం ఆసన్నమైంది. సేవాభావంతో పనిచేయడానికి అంకితమైన పార్టీ సిద్ధాంతాలనే తమ జీవిత ఆదర్శాలుగా మలుచుకున్నాం. మరే పరిస్థితుల్లోనూ తమ విలువలతో రాజీపడని… అటువంటి విశాలమైన కార్యకర్తల సమూహాన్ని మేము నిర్మించాము..’’ అని మోడీ అన్నారు.

ఇది కూడా చదవండి: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

‘‘మా ధ్యేయ సాధన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి అంశాలపై దేశంలో నేడు తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ దిశగా సానుకూల పురోగతి సాధించబడుతోంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని.. ఆత్మనిర్భర భారతదేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మేము నిస్వార్థంగా పనిచేస్తూనే ఉంటాం.’’ అని పేర్కొన్నారు.

‘‘కొన్ని సంవత్సరాల్లో బీజేపీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఇది ఒక గొప్ప మైలురాయి. ఒక గొప్ప స్ఫూర్తి. మనం కొత్త లక్ష్యాల గురించి ఆలోచించాలి. అలాగే మారుతున్న ఈ సాంకేతిక యుగంలో మమేకం కావాలి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా కోట్లాది మంది కార్యకర్తలకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని మోడీ అన్నారు.