
మై విలేజ్ షో ద్వారా గంగవ్వ ప్రపంచానికి పరిచయమైంది. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది. తన వీడియోల ద్వారా ప్రతీ కుటుంబంలో ఒక మెంబర్ గా మారిపోయింది. బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ సంకల్పబలముంటే ఏదైనా సాధ్యమే అని యూత్ కు మెసేజ్ అందించింది. వయసు మళ్లిన దశలో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారి సక్సెస్ కు నిదర్శనంగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా గంగవ్వ ప్రజావాణికి హాజరైంది.
మల్యాల మండలం తాటిపల్లి శివారులో ప్రభుత్వ భూమిలో ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజావాణి కి వచ్చింది మై విలేజ్ షో, బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ. గ్రామ సర్పంచ్తో కలిసి అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చింది. సమస్యను విన్న అడిషనల్ కలెక్టర్ వారంలో గంగవ్వ సమస్య పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంగవ్వ రాకతో కలెక్టరేట్ లో సందడి వాతావరణం నెలకొంది. కలెక్టరేట్లో గంగవ్వను చూసిన అభిమానులు సెల్ఫీలు, ఫోటోలతో బజ్ క్రియేట్ చేశారు.