Reading Time: < 1 minute
Former Mla Pinnelli Ramakrishna Reddy Granted Bail In Tdp Leaders Murder Case Court Denies Bail To His Brother

Pinnelli Ramakrishna Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు బెయిల్‌ మంజూరు అయ్యింది.. గురజాల కోర్టు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈ క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. దీంతో, 98 రోజుల నుంచి నెల్లూరు జైలులో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంతో.. ఆయనకు భారీ ఊరట దక్కినట్టు అయ్యింది.. ఇదే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ ఈ కేసులో ఒక కీలక నిర్ణయం తీసుకుంది గురజాల కోర్టు..

Read Also: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ మాస్ గర్జన.. 2 గంటల 44 నిమిషాల నాన్-స్టాప్ ఎంటర్టైన్‌మెంట్: హరీష్ శంకర్