Reading Time: < 1 minute
Kejriwal Delimitation Attack Democracy South India Bias Tamil Nadu Campaign

దక్షిణాది రాష్ట్రాలకు వివక్షకు గురవుతున్నాయని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. డీఎంకేకు మద్దతుగా తమిళనాడులో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ… డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. అందుకే ఆ బిల్లును వ్యతిరేకించినట్లుగా చెప్పారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ చాలా మంచి పని చేస్తున్నారని భావిస్తున్నానన్నారు. మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతు ఇవ్వాలని తెలిపారు. తమిళనాడులో బీజేపీ ఉనికే లేదని.. ఆ పార్టీకి ఎవరూ మద్దతు ఇవ్వొద్దని కోరారు.

లిక్కర్ కేసు..
ఢిల్లీ లిక్కర్ కేసులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మను తొలగించాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ అంశంపై తొలిసారి కేజ్రీవాల్ స్పందించారు. ‘‘నిన్నటి నుంచి తమిళనాడులోనే ఉన్నాను. నేను తిరిగి వెళ్లాక ఉత్తర్వును క్షుణ్ణంగా చదవాలి. నేను కోర్టులో నా వాదనలు వినిపించాను. ఇంతకు మంచి ఏమీ వ్యాఖ్యానించలేను.’’ అని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసును ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు కొట్టేసింది. అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారిస్తున్నారు. అయితే ఆమెపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. జస్టిస్ శర్మ ఆర్ఎస్ఎస్ భావజాలు కలిగిన వారని.. ఈ కేసులో న్యాయం చేస్తారని అనుకోలేమన్నారు. ఈ కేసు నుంచి ఆమెను తప్పించాలని పిటిషన్ వేశారు. సోమవారం ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.